సత్యసాయి: పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో సత్యసాయి సన్నిధిలో జరిగే కార్యక్రమాల వేళలను ట్రస్టు వర్గాలు మార్చాయి. సోమవారం నుంచి కొత్త సమయాలు అమలులోకి రానున్నాయి. ఉదయం 8 గంటలకు వేద పఠనం, 9 నుంచి 9:30 వరకు భజనలు నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు వేద పఠనం, 5:45 నుంచి 6:30 వరకు భజనలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.