TG: రాష్ట్రానికి వాతావరాణశాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షాల దాటికి… పంట నష్టం వాటిల్లింది. అంతేకాకుండా మార్చి 24, 25 తేదీల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.