SRD: సంగారెడ్డి కొత్త బస్టాండ్ సమీపంలో ఆదివారం రాత్రి 9 గంటలకు డప్పు నరేష్ (22)పై గుర్తుతెలియని వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నరేష్ తలకు తీవ్ర గాయమై రక్తస్రావం కావడంతో స్పృహ కోల్పోయాడు. స్థానికుల సమాచారంతో కంది 108 సిబ్బంది ఈఎంటీ చిరంజీవి, పైలెట్ రమేష్లు వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.