PDPL: తెలంగాణ ప్రభుత్వ విప్గా నియామకమైన అనంతరం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో మర్యాదపూర్వకంగా కలిశారు. తన నియామకానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. స్పీకర్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో విప్ వేముల వీరేశం పాల్గొన్నారు.