కర్నూలు: జిల్లాలోని క్రిష్ణగిరి మండలం ఎరుకలచెరువు సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం బండరాళ్లతో వెళుతున్న ట్రాక్టర్ బోల్తా పడి ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు గొల్లకుంట్ల గ్రామానికి చెందిన వ్యక్తిగా స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. మరిన్ని పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.