ATP: వికసిత భారత్, స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో అనంతపురం జిల్లా అగ్రగామిగా నిలవాలని 20 సూత్రాల కమిటీ ఛైర్మన్ లంకా దినకర్ పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్లో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, కలెక్టర్ ఓ.ఆనంద్తో కలిసి వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలపై సమీక్ష నిర్వహించారు. విద్యా, వైద్య రంగాల్లో పురోగతి సాధిస్తూ మానవ వనరుల అభివృద్ధికి బాటలు వేయాలన్నారు.