ADB: నేరడిగొండలో ఫైర్ స్టేషన్ కోసం ఏడాది నుంచి ఎదురుచూపులు సాగుతుండగా, తాజాగా బోరిగాం గ్రామంలో 5 ఇళ్లు దగ్ధం కావడం అధికారులను కదిలించింది. ఇటీవల అసెంబ్లీ సమావేశంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రస్తావించగా.. ప్రభుత్వం వెంటనే స్పందించి ఫైర్ స్టేషన్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు.