మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలం సిద్ధనపాలెం మండల పరిషత్ పాఠశాలలో నాగుపాము కలకలం రేపింది. ఉదయం తరగతుల గదుల వద్ద ప్రత్యక్షమైంది. టీచర్లు గుర్తించి స్నేక్ రెస్క్యూవర్ మల్లికార్జునకు సమాచారం అందించారు. అతను చాకచక్యంగా పామును బంధించి అడవిలో విడిచిపెట్టారు.