మహబూబ్నగర్ జిల్లాలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ వర్ధంతి సందర్భంగా సీపీఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కార్యదర్శి ఎ.రాములు మాట్లాడుతూ.. వీరుల ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేతలు, పలువురు నాయకులు పాల్గొన్నారు.