కడప: మండల నూతన తహసీల్దార్గా మహబూబ్ చాన్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో సుండుపల్లి, రాజంపేట మండలాల్లో తహసీల్దార్గా పనిచేసిన ఆమెకు పరిపాలనలో మంచి అనుభవం ఉంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండలంలో ఉన్న రెవిన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.