KRNL: ఆదోని మండలం సాదాపురంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం నిర్వహించారు. ఆదోని టీడీపీ నాయకుడు ఉమాపతి నాయుడు ఇవాళ పాల్గొని రైతులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న పంచసూత్రాలు, అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ వంటి పథకాల ప్రయోజనాలను వివరించారు.