KDP: రాజుపాలెం తహసీల్దార్ హరినాథ్ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జిల్లాలో పలువురు తహసీల్దార్లను కలెక్టర్ బదిలీ చేశారు. ఇందులో భాగంగా హరినాథ్ రెడ్డి రాజుపాలెం వచ్చారు. డిప్యూటీ తహశీల్దార్ మనోహర్ రెడ్డి, హుస్సేన్ రెడ్డి, వీఆర్వోలతో ఆయన సమావేశం అయ్యారు. మండలంలోని పరిస్థితులపై సమీక్షించారు. అనంతరం MLA వరదరాజుల రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.