కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. భిక్కనూర్లో అత్యధికంగా 37.1°C నమోదవగా, కొల్లూరు, ఎలుపుగొండ, నాగిరెడ్డిపేట్, బీర్కూర్, మాచాపూర్ ప్రాంతాల్లో 36°Cకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దోమకొండ 35°C నమోదు కాగా మిగతా ప్రాంతాల్లో 32°C నుంచి 35°C మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.