ELR: చింతలపూడిలోని రామకృష్ణ నగర్ ప్రధాన రహదారి ఆదివారం కురిసిన వర్షానికి చెరువును తలపిస్తోంది. గతంలో సీసీ రోడ్డు నిర్మించినా, ఇరువైపులా డ్రైనేజీలు లేకపోవడంతో నీరు వెళ్లే దారి లేక మడుగులా తయారైందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.