అనకాపల్లి కూరగాయల మార్కెట్లో వర్తకులు స్థానిక రైతుల నుంచి టమాటాలు కొనుగోలు చేయాలని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం కూరగాయల మార్కెట్ను సందర్శించి స్థానిక వర్తకులతో మాట్లాడారు. వర్తకుల, రైతుల సమస్యలపై చర్చించారు. స్థానిక రైతుల నుంచి టమోటాలు కొనుగోలుకు వర్ధకులతో ఒప్పందం కుదిర్చారు.