KMM: వ్యవసాయ యాంత్రీకరణతోనే సాగు లాభసాటిగా మారుతుందని కాంగ్రెస్ రాష్ట్ర నేత మట్టా దయానంద్ అన్నారు. ఆదివారం పెనుబల్లిలో 50 శాతం సబ్సిడీపై రోటవేటర్లు, బేయిలర్లు, స్ప్రేయర్లను రైతులకు పంపిణీ చేశారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక రాయితీలు కల్పిస్తోందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ బాగం నీరజ పాల్గొన్నారు.