WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్ 2 రోజుల విరామం అనంతరం సోమవారం ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్లో సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తి ధర రూ.7,410 పలికింది. అలాగే 341 మిర్చి క్వింటాకు రూ.20,500 ధర పలకగా.. వండర్ హాట్(WH) మిర్చి రూ.35వేలు పలికింది. తేజ మిర్చి ధర రూ.19,450, ఎల్లో మిర్చి రూ.20,500 పలికాయి. మార్కెట్లో కొనుగోళ్లు కొనసాగుతున్నాయి.