SKLM: పాతపట్నం మేజరు పంచాయతీకి సంబంధించిన ఆశీల వేలం పాట సోమవారం జరగనుంది. పాటలో పాల్గొని హక్కులు పొందొచ్చని పంచాయతీ కార్యదర్శి వి.రామచంద్రరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన వారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధరావత్ చెల్లించి ఈ వేలంలో పాల్గొనవచ్చునని పిలుపునిచ్చారు. పాతపట్నం పంచాయతీ ఆఫీస్లో ఈ వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.