KMR: రాజంపేట మండలంలో పదో తరగతి పరీక్షలను గాడిలో పెట్టేందుకు కలెక్టర్ జిల్లా విద్యాశాఖ ఉన్నత అధికారులు ప్రత్యేక దృష్టిని సారించారు. తెలుగు, హిందీ పరీక్షలు ముగిసిన అనంతరం పదో తరగతి పరీక్షా పత్రాల వ్యవహారంపై ఆరోపణలు గుప్పుమన్నాయి. ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు ఒక తీరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మరో తీరు వ్యవహరిస్తున్నారన్న తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.