NRPT: అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో ఊట్కూరు మండలంలో పోలీసులు ముందస్తు అరెస్టులు కొనసాగించారు. రామచంద్రరావు పిలుపు మేరకు రాజధానికి బయలుదేరే బీజేపీ నాయకులను అర్ధరాత్రి నుంచే ఇళ్ల వద్ద మోహరించి అదుపులోకి తీసుకున్నారు. నాయకులు ఈ చర్యలను ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, కాంగ్రెస్ ప్రభుత్వం భయంతోనే అక్రమ అరెస్టులు చేస్తుందని మండిపడ్డారు.