పల్నాడు: కారంపూడి మండలం ఆదినారాయణ కాలనీలో సీపీఐ ఆధ్వర్యంలో ఈ నెల 24న తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, నిరుద్యోగ భృతి అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. రేపు జరిగే ధర్నాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.