ప్రకాశం: వెలుగొండ ప్రాజెక్టు పునరావాస కాలనీల్లో మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అధికారులకు ఆదేశించారు. బుధవారం సుంకేసుల, ఇడుపూరు, దేవరాజుగట్టు కాలనీలను పరిశీలించిన ఆమె, జంగిల్ క్లియరెన్స్, మిగిలిన సీసీ రోడ్ల పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. పరిహారం చెల్లింపుల్లో ఆలస్యం లేకుండా నిధులు అందిన వెంటనే పంపిణీ చేయాలన్నారు.