శ్రీకాకుళం జిల్లాలో పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తు గడువు గురువారంతో ముగియనుంది. దరఖాస్తు గడువు ఏప్రిల్ 4వ తేదీనే ముగియగా దాన్ని 9వ తేదీ వరకు పెంచినట్లు SKLM పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ నారాయణరావు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు polycetap.ap.gov.in వెబ్సైట్లో, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 25న పాలీసెట్ నిర్వహిస్తారు.