W.G: మొగల్తూరు ఎంపీడీవో కార్యాలయంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గురువారం ‘పోషణ పక్వాడా’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోషకాహారంపై అవగాహన కల్పించే పోస్టర్లను మండల స్థాయి అధికారులు సంయుక్తంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తహసీల్దార్ రాజ్ కిషోర్, ఎంపీడీవో త్రిశూల పాణి, సీడీపీవో ఊర్మిళ పాల్గొన్నారు.