కోనసీమ: ఆలమూరు మండలం పెదపళ్ల జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు కుడుపూడి దుర్గాప్రసాద్ అకాల మరణం పార్టీకి తీరని లోటని జనసేన పార్టీ ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్ అన్నారు. ఇవాళ దుర్గాప్రసాద్ మృతి చెందినట్లు తెలిసిన వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. పార్టీకి ఎంతో అండదండగా ఉండే దుర్గాప్రసాద్ లాంటి వ్యక్తి ని కోల్పోవడం దురదృష్టకరమన్నారు.