ADB: ఉట్నూర్ మండల కేంద్రంలో సాహితి వేదిక ఏకగ్రీవ ఎన్నికలను నిర్వహించారు. ఈ సందర్బంగా గౌరవ అధ్యక్షుడిగా రాథోడ్ భీంరావు, అధ్యక్షుడిగా ముంజం జ్ఞానేశ్వర్, ఉపాధ్యక్షులుగా తొడసం కైలాష్, పవార్ వినోద్, ప్రధాన కార్యదర్శిగా జాదవ్ మురళిలను ఎన్నుకున్నారు. అదేవిధంగా సభ్యులను సైతం నియమించారు. దీంతో పలువురు వారిని అభినందించారు.