W.G: భీమవరంలో సీపీఎం ఆధ్వర్యంలో 25వ రోజు ప్రజా చైతన్య పాదయాత్ర మావుళ్ళమ్మ ఆలయం నుంచి ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నేత వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. టిడ్కో గృహాల లబ్ధిదారుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదని మండిపడ్డారు. ఉగాది పండుగ గడిచినా ఇళ్ల పంపిణీలో వైఫల్యం చెందారని విమర్శించారు. పేదల సొంతింటి కల నెరవేర్చాలని డిమాండ్ చేశారు.