NZB: సిరికొండ మండలంలోని బీజేపీ నాయకులను పోలీసులు ఆదివారం అర్థరాత్రి ముందస్తు అరెస్టు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న తీరుకు నిరసనగా సోమవారం కలెక్టర్ ముట్టడి నేపథ్యంలో అరెస్టు చేశారు. శాంతి యుతంగా ప్రజా సమస్యలపై నిరసన తెలుపుతున్న నాయకులను పోలీసులు అర్థరాత్రి అరెస్టు చేసడం పట్ల బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నక్క రాజేశ్వర్ అసహనాన్ని వ్యక్తం చేశారు.