KDP: గంజాయి రవాణాను అరికట్టేందుకు ‘ఆపరేషన్ వజ్రపహార్’లో భాగంగా మైదుకూరులో ఆదివారం పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. అర్బన్ సీఐ కె. రమణారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని ట్రాన్స్పోర్ట్, పార్శిల్ సర్వీసుల్లో ఈ తనిఖీలు జరిగాయి. అనుమానాస్పద పార్శిల్స్ వస్తే లేదా గంజాయి రవాణాపై సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని యజమానులను ఆదేశించారు.