NLR: స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యకర్తలు, నాయకులు ప్రణాళిక బద్ధంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. నెల్లూరులో ఆదివారం రాత్రి ఆయన మాట్లాడుతూ.. వైసీపీ రాక్షస పాలనలో నాయకులు, కార్యకర్తలు అనేక పోరాటాలు చేసిన ఫలితంగానే టీడీపీ విజయం చేకూరిందని ఆయన తెలిపారు.