AP: చెన్నైకి చెందిన సుబ్బారావ్ అపెరల్స్ సంస్థ టీటీడీ శ్రీబాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి రూ.కోటి భారీ విరాళం అందించింది. తిరుపతిలో దాత జె.రాజారమేష్ ఈ విరాళం చెక్కును అదనపు ఈవో వెంకయ్యచౌదరికి అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్రెడ్డి కూడా పాల్గొన్నారు. భక్తుల ఆరోగ్య సేవలకు ఈ నిధులు వినియోగించనున్నారు.