• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘దళిత వాడల్లో స్మశాన వాటికలకు నిధులివ్వండి’

కృష్ణా: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా పామర్రు ఎమ్మెల్యే, ఎస్సీ వెల్ఫేర్ కమిటీ ఛైర్మన్ వర్ల కుమార్ రాజా కీలక విజ్ఞప్తి చేశారు. దళిత వాడలు, మైనారిటీ ప్రాంతాల్లో స్మశాన వాటికలు, కబరస్థాన్ల ఏర్పాటుకు బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే దళితులకు పూర్తి న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

February 20, 2026 / 03:37 PM IST

రైతులకు, కోళ్ల పెంపకం ద్వారా అదనపు ఆదాయం

ASR: జీ.మాడుగుల మండలంలోని వంజరి, గెమ్మెలి గ్రామాల్లో శుక్రవారం గిరిజన రైతులకు కోళ్ల పెంపకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. పశు వైద్యాధికారిణి రాగిణి, శాస్త్రవేత్త శ్రీహరి పాల్గొని, పౌల్ట్రీ ద్వారా అదనపు ఆదాయం పొందే మార్గాలను వివరించారు. అనంతరం ఒక్కో రైతుకు 15 కోళ్ల చొప్పున పంపిణీ చేశారు. బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

February 20, 2026 / 03:37 PM IST

‘హౌసింగ్ లే అవుట్ పనులు వేగవంతం చేయాలి’

ప్రకాశం: కంభం మండలంలోని కందులాపురం సమీపంలో గల హౌసింగ్ లేఅవుట్ను హౌసింగ్ ఏఈ శివప్రసాద్‌తో కలిసి ఎంపీడీవో వీరభద్రాచారి ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని అడిగి తెలుసుకుని, నిర్మాణాలు వేగవంతం చేసి లబ్ధిదారులకు ఇళ్లను త్వరగా అందించాలని సూచించారు. పనుల్లో నాణ్యతతో పాటు వేగం కూడా ముఖ్యమని ఎంపీడీవో తెలిపారు.

February 20, 2026 / 03:35 PM IST

అమ్మవారిపల్లిలో రోడ్డు ప్రమాదం

సత్యసాయి: పెనుకొండ మండలం అమ్మవారిపల్లి సమీపంలో కియా పోలీస్ స్టేషన్ ఎదురుగా శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అనంతపురం వైపు వెళ్తున్న స్విఫ్ట్ కారు టైర్ ఒక్కసారిగా బరస్ట్ కావడంతో నియంత్రణ కోల్పోయి ముందుగా ప్రయాణిస్తున్న థార్ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు వాహనాలు దెబ్బతిన్నప్పటికీ, అందులో ఉన్నవారికి ఎటువంటి గాయాలు కాలేదని సమాచారం.

February 20, 2026 / 03:32 PM IST

ఎండిపోతున్న పొలాలకు సాగునీరు: ఎమ్మెల్యే

NLR: ఎండిపోతున్న 400 ఎకరాలకు రూ. 10 లక్షల వ్యయంతో పైపులు ద్వారా పంపింగ్ చేసి పొలాలు ఎండిపోకుండా చర్యలు తీసుకున్నామని MLA సోమిరెడ్డి అన్నారు. మనుబోలు మండలం కొండూరు సత్రంలోని పొట్టేళ్ల కాలువ వద్ద చెక్ డ్యామ్ నుంచి వేస్తున్న పైప్ లైన్‌ను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. పొట్టేళ్ల కాలువ వద్ద నిర్మించిన చెక్ డ్యాంతో 2500 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు.

February 20, 2026 / 03:30 PM IST

8 వేల మందితో వైసీపీ ప్లాన్

PLD: వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో 7 నుంచి 8వేల మందితో వైసీపీ క్రియాశీలక సైన్యాన్ని సిద్ధం చేస్తుంది. ఈ విషయాన్ని నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం తెలిపారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ఈ కార్యకర్తలకు ఐడీ కార్డులు జారీ చేయడంతో పాటు, వారికి ప్రమాద, సహజ మరణ బీమా సౌకర్యం కల్పిస్తామని ఆయన వెల్లడించారు.

February 20, 2026 / 03:30 PM IST

జనాభా లెక్కల సేకరణలో సెన్సస్ అధికారుల పాత్ర కీలకం

E.G: ఏపీ సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి ప్రిన్సిపల్ సెన్సస్ అధికారుల సమావేశంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పాల్గొన్నారు. 2027లో నిర్వహించనున్న జనాభా లెక్కల సేకరణకు సంబంధించి సన్నద్ధత, శిక్షణా కార్యక్రమాలు ఎంపిక అంశాలపై విస్తృతంగా చర్చ జరిగిందన్నారు. జనాభా లెక్కల సేకరణలో సెన్సస్ అధికారుల పాత్ర కీలకం అని కలెక్టర్ స్పష్టం చేశారు.

February 20, 2026 / 03:30 PM IST

‘ఆరోగ్యకర పంటల సాగుతో అధిక మద్దతు ధర సాధ్యం’

VZM: ఆరోగ్యకర పంటల సాగుతో రైతులకు అధిక మద్దతు ధర లభిస్తుందని గజపతినగరం ఏడీఏ నిర్మల జ్యోతి అన్నారు. శుక్రవారం గజపతినగరం మండలంలోని కొత్తబగ్గంలో పొలంబడి శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మేలైన సాగు పద్ధతిలో పంటలు పండించాలన్నారు. వరి సాగు చేస్తున్న రైతులకు పలు అంశాలపై వ్యవసాయ అధికారి కిరణ్ కుమార్ శిక్షణ కల్పించారు.

February 20, 2026 / 03:28 PM IST

‘శ్రీకాకుళం తీరంలో రేర్ ఎర్త్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి’

శ్రీకాకుళం తీరంలో అపారంగా ఉన్న ఇల్మెనైట్, సిల్లిమనైట్, జిర్కాన్, రూటైల్, గార్నెట్, మోనాజైట్ వంటి అరుదైన ఖనిజాలను పూర్తిస్థాయిలో వినియోగించి, స్థానికంగానే ‘రేర్ ఎర్త్’ ప్లాంట్ ఏర్పాటు చేయాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ శాసనసభలో కోరారు. దేశం చైనా తదితర దేశాల నుంచి భారీగా రేర్ ఎర్త్ మూలకాలను దిగుమతి చేసుకుంటోందని గుర్తుచేసారు.

February 20, 2026 / 03:26 PM IST

భాషా పండిట్లకు అప్ గ్రేడ్ ఉత్తర్వులు ఇవ్వాలి

పార్వతీపురం ఐటీడీఏలో భాషా పండిట్లకు అప్ గ్రేడ్ ఉత్తర్వులు ఇవ్వాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. భాషా పండిట్లకు పాఠశాల సహాయకులుగా పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కానీ పార్వతీపురం ఐటీడీఏలో ప్రక్రియ ముందుకు సాగడం లేదని అన్నారు.

February 20, 2026 / 03:26 PM IST

బీసీ వెల్ఫేర్ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

BPT: నిజాంపట్నం బాలుర పాఠశాల, జూనియర్ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి 5వ తరగతి, ఇంటర్ (MPC, BiPC, CEC) ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ విషయన్ని ప్రిన్సిపల్ నాగమల్లేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే 6, 7, 8 తరగతుల్లో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ సీట్లను కూడా భర్తీ చేసున్నామని వెల్లడించారు. ఆసక్తి గల విద్యార్థులు మార్చి 4వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

February 20, 2026 / 03:22 PM IST

అంబేద్కర్ విగ్రహం వద్ద సీపీఐ ఆందోళన

నంద్యాల జిల్లా డోన్ పట్టనంలో డాక్ట‌ర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం సీపీఐ నాయకులు సామాజిక న్యాయం కోసం ఆందోళన నిర్వహించారు. కార్పొరేట్ సంపదను పునర్పంపిణీ చేయాలని, భారత రాజ్యాంగాన్ని కాపాడుతూ లింగ వివక్షను నివారించాలని, అందరికీ విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలను సమానంగా కల్పించాలని డిమాండ్ చేశారు.

February 20, 2026 / 03:20 PM IST

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

చిత్తూరు నగరపరిధిలోని పలు వార్డుల్లో రూ. 49.35 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ ప్రారంభించారు. మిట్టూరులో సిమెంటు రోడ్లు, కాలువలు, పంట్రాంపల్లిలో నూతన బోరు, మోటారును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చుడా చైర్ పర్సన్ కఠారి హేమలత, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, స్థానిక టీడీపీ, కూటమి నాయకులు పాల్గొన్నారు.

February 20, 2026 / 03:18 PM IST

‘రానున్న MPTC, ZPTC ఎన్నికలను బహిష్కరిస్తాం’

KRNL: ఆదోనిని జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్ మళ్లీ ఊపందుకుంది. శుక్రవారం ప్రత్యేక జిల్లా హోదా ప్రకటించే వరకు తమ ఓటు వేయబోమని పలువురు గ్రామస్తులు హెచ్చరించారు. రానున్న సర్పంచ్, MPTC, ZPTC ఎన్నికలను బహిష్కరిస్తామని ప్రకటించారు. ఆదోనికి జిల్లా హోదా కల్పించాలని ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

February 20, 2026 / 03:12 PM IST

ఉద్యోగుల సమస్యలపై గ్రీవెన్స్

అనకాపల్లి కలెక్టరేట్‌లో శుక్రవారం ఉద్యోగుల సమస్యలపై గ్రీవెన్స్ నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్ ఉద్యోగం నుంచి అర్జీలను స్వీకరించి వాటిని పరిశీలించారు. ఉద్యోగుల వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెల మూడవ శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరిష్కారానికి అవకాశం గల ప్రతి సమస్యను పరిష్కరిస్తామన్నారు.

February 20, 2026 / 03:12 PM IST