ELR: తడికలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రమాదకర మలుపుల వద్ద రేడియం స్టిక్కర్లతో కూడిన డబ్బాలను ఏర్పాటు చేసినట్లు ఎస్సై చెన్నారావు తెలిపారు. రాత్రి వేళల్లో ఈ స్టిక్కర్లు మెరుస్తూ.. వాహనదారులను అప్రమత్తం చేస్తాయని, దీనివల్ల ప్రమాదాలు తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రయాణికులు రవాణా నిబంధనలు పాటిస్తూ.. అప్రమత్తంగా వాహనాలు నడపాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.