KRNL: ఆస్పరి మండలం చిన్న హోతూరు గ్రామ పొలాల్లో గాలి మరల (ఫ్యాన్లు) పనులు ప్రారంభించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. మరలు నిర్మించేందుకు అన్ని అనుమతులు వచ్చినందుకు పనులు చేపట్టామన్నారు. ఇప్పటికే కొన్ని గాలి మరలు పూర్తయ్యాయని, వ్యవసాయానికి అనుగుణంగా వాటిని నిర్మిస్తున్నామని కాంట్రాక్టర్ తెలిపారు.
అనకాపల్లి నియోజకవర్గ పరిధిలో అర్హులైన వారందరికీ పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు మంజూరుకు చర్యలు తీసుకుంటామని టీటీడీ సమన్వయకర్త పీలా గోవింద హామీ ఇచ్చారు. శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. శుక్రవారం ప్రజలు పార్టీ శ్రేణులకు పలు సమస్యలపై గ్రీవెన్స్ నిర్వహించారు. అనారోగ్యానికి గురై చికిత్స తీసుకున్న వారికి CMRF చెక్కులు అందజేశారు.
శ్రీకాకుళంలోని గుజరాతి పేట సమీపంలోని పురుషోత్తం నగర్ కాలనీలో తాగునీటి కుళాయి నుంచి నీరు వృథాగా పోతుంది. దీని మూత పాడవడంతో నీరు పైనుంచి ధారలా కారుతుంది. గత కొన్ని రోజులుగా నీరు ఇలాగే వృధాగా పోతుందని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించాలని కోరారు.
AKP: చోడవరం షుగర్ ఫ్యాక్టరీ రైతులకు, కార్మికులకు బకాయిలు చెల్లించాలని ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్.రాజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా రైతులు కార్మికులు బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం శాసనసభలో మాట్లాడుతూ.. పీపీపీ విధానంలో డిష్టలరీ, ఇథనాల్ ఉత్పత్తి చేసే విధంగా ఫ్యాక్టరీని తిరిగి తెరిపించాలన్నారు.
CTR: పుంగనూరు మండలం శాంతినగర్ సమీపంలో ఇవాళ ఉదయం రోడ్డు దాటుతున్న చిన్నారి (5)ని 42వ జాతీయ రహదారిపై మదనపల్లి నుంచి పుంగనూరుకు వస్తున్న కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే స్థానికులు గాయపడ్డ చిన్నారిని ఏరియా హాస్పిటల్కి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సలహా మేరకు మదనపల్లె జిల్లా ఆసుపత్రి తరలించారు.
ప్రకాశం: తాళ్లూరు మండలం మల్కాపురం గ్రామం లో పంట నమోదు వివరాలను ఏవో ప్రసాద రావు శుక్రవారం పరిశీలించారు. ఈ పంట నమోదు చేసిన వివరాలు సక్రమంగా ఉన్నాయో లేవో సూపర్ చెక్ చేయటం జరుగుతుందని ఏవో చెప్పారు. రబీలో ఇప్పటి వరకు 17,536 ఏకరాలు ల్యాండ్ చేయటం జరిగిందన్నారు. కావున ప్రతి ఒక్కరు పంట నమోదు చేసుకోవాలన్నారు.
ASR: బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే జరిమానా విధిస్తామని శుక్రవారం కొయ్యూరు ఎంపీడీవో ప్రసాదరావు హెచ్చరించారు. వ్యాపారులు, దుకాణాల ఎదుట విధిగా డస్ట్ బిన్స్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. పరిసరాల పరిశుభ్రతకు అందరూ సహకరించాలన్నారు. దుకాణాల్లో నిషేధిత ప్లాస్టిక్ కవర్లను విక్రయించరాదని తెలిపారు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
E.G: రాజమండ్రి రూరల్ మండలం ధవలేశ్వరం కాటన్ బ్యారేజీపై శుక్రవారం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆత్రేయపురం మండలం రాజవరంకి చెందిన కేదరశెట్టి వీర వెంకట సత్యనారాయణ ద్విచక్ర వాహనంపై రాజమండ్రి వెళ్తుండగా బ్యారేజీ 14వ గేటు వద్ద ప్రమాదవశాత్తు వంతెనను ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సీఐ హరిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
TPT: చిట్టమూరు మండలం ఉప్పలమర్తి గ్రామంలో శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి పరివార దేవతల నూతన విగ్రహ ప్రతిష్ఠ, మహా కుంభాభిషేక మహోత్సవాలు ఈనెల 23 నుంచి 25 వరకు వైభవంగా జరగనున్నాయి. 23న గ్రామోత్సవం, 24న విశేష పూజలు నిర్వహిస్తారు. 25న మహా కుంభాభిషేకం, అనంతరం శాంతి కళ్యాణం, అన్నదానం జరుగుతాయని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
PPM: గరుగుబిల్లి మండలానికి చెందిన BSF జవాను జయప్రకాశ్ నారాయణ జ్ఞాపకార్థం స్దానిక సీతారామపురంలో గ్రామస్థులు శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణం చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం ప్రతిష్ట మహోత్సవం నిర్వహించారు. IND-BNG సరిహద్దుల్లో దేశ రక్షణ విధుల్లో 2009లో వీరమరణం పొందారని జవానుకు గుర్తుగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు.
VZM: ప్రజలు తమ యొక్క విధులు బాధ్యతలను తప్పనిసరిగా తెలుసుకోవాలని గజపతినగరం కోర్టు న్యాయమూర్తి ఏ విజయ రాజ్ కుమార్ అన్నారు. శుక్రవారం బోడసింగిపేట గ్రామంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు జరిగింది. ముఖ్యంగా రాజ్యాంగంపై పౌరులు అవగాహన కల్పించుకోవాలన్నారు. చట్టాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
CTR: రంజాన్ మాసం ప్రారంభం మైన సందర్భంగా పుంగునూరు పట్టణంలో పేద ముస్లింలకు MM మహమ్మద్ అలీ ఆధ్వర్యంలో నెల రోజులకు సరిపడా నిత్యవసర సరుకులను శుక్రవారం ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ పండుగ అందరు సంతోషంగా జరుపుకోవాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని 20 సంవత్సరాల నుంచి చేపడుతున్నట్లు తెలిపారు.
VZM: కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో గుర్ల మండలం పెద్దబంటుపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల కోసం టీచర్లు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ మేరకు శుక్రవారం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి చిన్నారులను ప్రభుత్వ పాఠశాలలో చేర్చించాలని తల్లిదండ్రులను కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు.
KDP: ప్రొద్దుటూరు మైదుకూరు రోడ్డులోని సినీ హబ్ మలుపు వద్ద శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జీవరత్నం అనే యువకుడు మృతి చెందాడు. ఖాజీపేట మండలం ఏటూరు గ్రామానికి చెందిన జీవరత్నం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, లారీ ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు ప్రారంభించారు.
సత్యసాయి: అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన చేనేత స్టాళ్లను రాష్ట్ర చేనేత, జౌళి శాఖా మంత్రి సవిత శుక్రవారం సందర్శించారు. జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆమె పరిశీలించి, అందుబాటులో ఉన్న వస్త్రాల స్టాక్ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వినియోగదారులకు అనుగుణంగా నూతన డిజైన్లు, నాణ్యమైన వస్త్రాలను సమృద్ధిగా నిల్వ ఉంచాలని మంత్రి ఆదేశించారు.