• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలి’

KDP: ప్రొద్దుటూరు నేర సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ విశ్వనాథ్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత వాతావరణానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మహిళా భద్రత, గంజా నిర్మూలన, రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్ల కదలికలపై నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.

February 20, 2026 / 06:16 AM IST

కళ్యాణదుర్గంలో నిలిచిన ప్యాసింజర్ రైలు

ATP: రైలు ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో కదిరిదేవరపల్లి – తిరుపతి ప్యాసింజర్ రైలు కళ్యాణదుర్గం స్టేషన్ సమీపంలో నిలిచిపోయింది. గురువారం కదిరిదేవరపల్లి నుంచి బయల్దేరిన ఈ రైలులో కొద్దిదూరం వెళ్ళాక సమస్య ఏర్పడటంతో, సిబ్బంది తాత్కాలిక మరమ్మతులు చేసి కళ్యాణదుర్గం స్టేషన్‌కు చేర్చారు. దీంతో గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

February 20, 2026 / 06:16 AM IST

ఎలుగుబంటి దాడి.. గ్రామస్తుల్లో భయం

అన్నమయ్య: రైల్వేకోడూరులోని బోటుమీదపల్లె రైల్వే ట్రాక్ సమీపంలో నిన్న దేశయ్యపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. గత 15 రోజులుగా ఓబులవారిపల్లె, కోడూరు మండల పరిసర గ్రామాల్లో రెండు ఎలుగుబంట్లు ప్రజలపై దాడులు చేస్తున్నాయి. గ్రామస్తులు అటవీశాఖ చర్యలు తీసుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

February 20, 2026 / 06:15 AM IST

గోరంట్ల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన అడిషనల్ ఎస్పీ

SS: గోరంట్ల పోలీస్ స్టేషన్‌ను అడిషనల్ ఎస్పీ అంకిత సురాన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, లాకప్ గది, మహిళా హెల్ప్‌డెస్క్‌ను పరిశీలించి కేసుల పురోగతిపై ఆరా తీశారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, నేరాల నియంత్రణకు రాత్రి బీట్లు పెంచాలని అధికారులను ఆదేశించారు. ఎస్సైలు రామచంద్ర, ఉమాదేవి, సిబ్బంది పాల్గొన్నారు.

February 20, 2026 / 06:12 AM IST

యువకుడిపై పోక్సో కేసు నమోదు

TPT: పుత్తూరు ప్రాంతానికి చెందిన ఓ బాలికను తిరుపతికి చెందిన యువకుడు యూసఫ్ (23) మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అఘయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ శేఖర్ రెడ్డి తెలిపారు. గురువారం యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

February 20, 2026 / 06:12 AM IST

కోదండరామయ్య కళ్యాణానికి 110 కిలోల ముత్యాలు

KDP: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ఈ ఏడాది ఏప్రిల్ 1న నిర్వహించే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి 110 కిలోల ముత్యాలను కానుకగా ఇచ్చేందుకు నెల్లూరు జిల్లా కోవూరు MLA,TTD పాలకమండలి సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, నెల్లూరు లోక్ సభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు ముందుకొచ్చినట్లు డిప్యూటీ ఈవో ఏ.ప్రశాంతి గురువారం తెలిపారు.

February 20, 2026 / 06:12 AM IST

నేటి నుంచి నగరంలో ట్రాఫిక్ మళ్లింపు

CTR: చిత్తూరు మురకంబట్టులోని చిత్తూరు-పూతలపట్టు రైల్వే మార్గంలో ట్రాక్ మరమ్మతు పనులను శుక్రవారం ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే ట్రావెల్ క్రాసింగ్ నంబరు 22 పూర్తి ట్రాక్‌ను అప్ గ్రేడేషన్ చేయనుండటంతో శుక్రవారం నుంచి మార్చి 1వ తేదీ వరకు ట్రాఫిక్ మళ్లింపునున్నట్లు చెప్పారు.

February 20, 2026 / 06:11 AM IST

‘మత్స్యకారులకు చట్టసభల్లో అవకాశాలు కల్పించాలి’

AKP: సంప్రదాయం మత్స్యకారులకు చట్టసభల్లో అవకాశాలు కల్పించాలని జాతీయ మత్యకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు మోసా అప్పలరాజు విజ్ఞప్తి చేశారు. గురువారం పాయకరావుపేట సంఘం కార్యాలయంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 30 లక్షల ఓట్లు ఉన్న మత్స్యకారులను అన్ని పార్టీలు ఓటు బ్యాంకుగా వినియోగించుకుంటున్నాయన్నారు. ఏ పార్టీ ఇప్పటివరకు మత్స్యకారులకు తగిన గుర్తింపు ఇవ్వలేదన్నారు.

February 20, 2026 / 06:05 AM IST

ఈ నెల 23 నుంచి ఆదర్శ పాఠశాలలో దరఖాస్తులు స్వీకరణ

VZM: ఈ నెల 23 నుంచి ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ ఈశ్వరరావు గురువారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెల 30 వరకు గడువు ఉందని ఆసక్తి గల విద్యార్థులు WWW.CSe.ap.gov.in/ www.apms.apcfss.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పూర్తి వివరాలకు పాఠశాల పనిచేయు వేళల్లో సంప్రదించవచ్చుని పేర్కొన్నారు.

February 20, 2026 / 06:04 AM IST

బాధితులకు CMRF చెక్కులు పంపిణీ

E.G: రాజానగరం మండలం పల్లకడియం గ్రామానికి చెందిన గంగలూరి పాపయమ్మకు రూ.23,400, రెక్కల చంటిబాబుకు రూ.52,723 విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను జనసేన కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి గురువారం పంపిణీ చేశారు. వైద్య ఖర్చుల కోసం పేదలు ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఈ సాయం అందిస్తోందని ఆమె పేర్కొన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

February 20, 2026 / 06:04 AM IST

నేడు మాచర్లలో ఈ-వ్యర్థాల సేకరణకు ప్రత్యేక డ్రైవ్

PLD: మాచర్ల పురపాలక పరిధిలో ఈ-వ్యర్థాల సేకరణకు మున్సిపల్ కమిషనర్ వేణుబాబు శ్రీకారం చుట్టారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు మున్సిపల్ కార్యాలయం నుండి పార్క్ సెంటర్ వరకు ఈ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఇకపై ప్రతి నెల 10, 20 తేదీల్లో ఈ సేకరణ ఉంటుందని, ప్రజలు తమ పాత ఎలక్ట్రానిక్ వస్తువులను మున్సిపల్ కార్యాలయంలోని కలెక్షన్ సెంటర్‌లో అందజేయాలని ఆయన కోరారు.

February 20, 2026 / 06:02 AM IST

ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య

ప్రకాశం: కనిగిరి మున్సిపల్ పరిధిలోని స్థానిక పాతూరు ఎస్సీ పాలెంకు చెందిన ఓ యువకుడు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య సంఘటన గురువారం రాత్రి వెలుగులోకి వచ్చింది. స్థానికులు విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న కనిగిరి ఎస్సై సందీప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 20, 2026 / 06:02 AM IST

హత్య కేసులో ఎమ్మెల్సీ అనంత బాబు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

KKD: డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు కష్టాలు మొదలయ్యాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు ముమ్మరం చేసి గురువారం సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. కాకినాడ ఎన్డీపీఓ మనీశ్ దేవరాజు పాటిల్ ఈ కేసులో అనంతబాబు భార్యను A-2గా చేర్చారు. దీంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది

February 20, 2026 / 06:01 AM IST

మంత్రి లోకేశ్ నివాసంలో ఆత్మీయ విందు

BPT: ఉండవల్లిలోని మంత్రి లోకేశ్ నివాసంలో జరిగిన ఆత్మీయ విందులో మంత్రి గొట్టిపాటి రవికుమార్ తన కుటుంబంతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొట్టిపాటి సతీమణికి లోకేశ్ మంగళగిరి పట్టుచీరను బహూకరించారు. ఒంగోలు, బాపట్ల పార్లమెంట్ పరిధిలోని నేతల కలయికతో ఈ భేటీ సందడిగా సాగింది. రాజకీయ అంశాలతో పాటు వ్యక్తిగత అనుబంధాలను ఈ సమావేశంలో పంచుకున్నారు.

February 20, 2026 / 06:00 AM IST

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

కృష్ణా: ఉంగుటూరు గ్రామ శివారులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారంతో ఎస్‌ఐ యు. గోవిందు తన సిబ్బందితో కలిసి మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 4,210 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

February 20, 2026 / 06:00 AM IST