PPM: జియ్యమ్మవలస పరిసర ప్రాంతాల్లో కొద్ది రోజులుగా గజరాజులు సంచరిస్తున్నాయి. ప్రస్తుతం ఓల్డ్ బట్టలభద్ర-ఓల్డ్ బిత్రపాడు గ్రామాల మధ్య ఏనుగుల గుంపు తిరుగుతోంది. అయితే, సమీప పంట పొలాలకు రైతులు బిక్కుబిక్కుమంటూ వెళ్తున్నారు. ఏ క్షణాన దాడి చేస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. ఏనుగుల సంచారంపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.