సూర్యాపేట పట్టణంలోని కేసారం వద్ద నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో మౌళిక సదుపాయాలను కల్పించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సంబందిత కాంట్రాక్టర్ను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రెవెన్యూ, మున్సిపల్, హౌసింగ్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.