MBNR: చారకొండ మండలంలోని సిర్సనగండ్ల సీతారామచంద్ర స్వామి ఆలయం ‘దక్షిణ అయోధ్య’గా ప్రసిద్ధి గాంచింది. త్రేతాయుగంలో రాముడు వనవాస సమయంలో ఇక్కడ విశ్రమించారని, అగస్త్య మహర్షి కోరిక మేరకు సీతాసమేతుడై వెలిశారని పురాణాలు చెబుతున్నాయి. నేడు శ్రీరామనవమి సందర్భంగా ఘనంగా రామయ్య కళ్యాణ మహొత్సవం నిర్వహిస్తారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తారని అధికారులు ఏర్పాట్లు చేశారు.