E.G: అనపర్తి నియోజకవర్గంలో రక్షిత మంచినీటి సౌకర్యం కోసం రూ.42 కోట్ల నిధులు మంజూరైనట్లు MLA నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇవాళ తెలిపారు. ప్రతి గ్రామానికి సురక్షిత జలాలు అందించేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించారు. ఈ నిధులతో మంచినీటి సమస్యకు ఇబ్బంది ఉండదన్నారు.