KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ధ్వజారోహణం నిర్వహిస్తున్నట్లు ఆలయ డిప్యూటీ ఈవో ప్రశాంతి తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద ఉత్సవమూర్తులను ఆశీనులు చేసి పూజలు చేస్తారు. అనంతరం ధ్వజస్తంభానికి, బలిపీఠానికి పూజలు చేసి, గరుడ పథకాన్ని ఎగురవేయడంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి.