NDL: బేతంచెర్ల నగర పంచాయతీ పరిధిలో 2025-26కు సంబంధించి ఇంటి పన్నులు, ఫ్యాక్టరీ, కుళాయి, కాళీ స్థలాల పన్నులు, ట్రేడ్ లైసెన్స్ చెల్లించుటకు ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున వడ్డీపై 50% రాయితీ ఇస్తున్నట్లు నగర పంచాయతీ కమిషనర్ హరిప్రసాద్ గురువారం తెలిపారు. ఈ అవకాశం ఈనెల 31వ తేదీ వరకు ఉందన్నారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.