SS: సోమందేపల్లి మండలం పరిసర గ్రామాల్లో పెంపుడు జంతువులను రోడ్లపై వదిలివేయడం వల్ల వాహనదారులకు ప్రమాదాలు జరుగుతున్నాయని ఎస్సై సుధాకర్ యాదవ్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. యజమానులు కోళ్లు, కుక్కలు, ఆవులు, జంతువులను బహిరంగ ప్రదేశాల్లో వదిలివేయడం చట్టరీత్యా నేరమన్నారు. యజమానులు తమ జంతువులను తమ స్వంత ప్రదేశాల్లోనే కట్టడి చేయాలని కోరారు.