KMR: మద్నూర్లోని పోస్టాఫీసులో శుక్రవారం ఉదయం నుంచి నెలవారీ పింఛన్ల పంపిణీ ప్రారంభం కానున్నట్లు పంపిణీ సిబ్బంది మెంగావార్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. వృద్ధాప్య, వికలాంగుల, వితంతు పింఛన్లతో పాటు ఇతర అన్ని రకాల సామాజిక భద్రతా పింఛన్లను లబ్ధిదారులకు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ పంపిణీ ప్రక్రియ వారం రోజుల పాటు కొనసాగుతుందని పేర్కొన్నారు.