BHNG: చౌటుప్పల్ మున్సిపాలిటీ ట్రినిటీ హైస్కూల్లో ట్రాఫిక్ నియమాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చౌటుప్పల్ ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 21 సంవత్సరాలు దాటిన వారు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ పొందాలని సూచించారు.