VZM: గుర్ల మండలం జమ్ముపేట ఆర్వోబీ కింద చిన్నపాటి వర్షానికే నీరు నిల్వ ఉంటోంది. వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షానికే నీరు నిల్వ ఉండిపోయింది. మట్టి ఎక్కువగా చేరుతుండటంతో వాహనాలు జారిపడిపోయే ప్రమాదముందని భయాందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.