PPM: జీడి తోటల పునరుద్ధరణతో రైతులకు అధిక ఆదాయం వస్తుందని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు. సోమవారం గుమ్మలక్ష్మీపురంలో జీడి రైతులకు కొమ్మల కత్తిరింపు సామగ్రిని ఉచితంగా అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. 5 సంవత్సరాలు దాటిన తోటల్లో కొమ్మలు కత్తిరిస్తే అధిక దిగుబడులు వస్తాయని తెలిపారు. అలాగే నియోజకవర్గంలో జీడి రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.