ELR: దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సోమవారం పెదవేగి మండలం దుగ్గిరాల క్యాంప్ కార్యాలయంలో పలు గ్రామాలు చెందిన ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు. అలాగే వాటిని సంబంధిత అధికారులు దృష్టికి తీసుకువెళ్లి సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామన్నారు.