BPT: చీరాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య హాజరై, ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అందిన అర్జీలను సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.