ప్రకాశం: మార్కాపురంలో ఏబీ స్విచ్ ఫిక్సింగ్ పనులు చేస్తున్నారు. ఈక్రమంలో ఇవాళ ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని శాఖ ఏఈ శ్రీనివాసరావు తెలిపారు. జవహర్ నగర్ కాలనీ, ఏపీజీబీ ఏరియా, తూర్పు వీధి, బోడపాడు రోడ్డులో సరఫరాకు అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలని కోరారు.
GNTR: పర్యావరణ పరిరక్షణ కోసం శుక్రవారం గుంటూరు నగరవ్యాప్తంగా ఈ-వ్యర్థాల సేకరణ చేపట్టనున్నట్లు జీఎంసీ కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. పాత మొబైళ్లు, చార్జర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను సాధారణ చెత్తతో కలిపి పారవేయడం వల్ల భూగర్భ జలాలు కలుషితమవుతాయని ఆయన హెచ్చరించారు. ఈ వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వీర్యం చేసేందుకు వీలుగా ప్రజలందరూ సహకరించాలన్నారు.
VSP: వేపగుంట మండలం విరాట గర్ 33/11 కేవీ సబ్ స్టేషన్ పరిధిలోని ఫీడర్ల నిర్వహణ పనుల కారణంగా శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఈఈ బి.సింహాచలం నాయుడు తెలిపారు. దీనివల్ల బాలాజీగార్డెన్స్, శ్రీనివాసనగర్, గొల్లనారాయణ పురం, దత్తసాయినగర్, సింహాద్రినగర్, తదితర ప్రాంతాల్లో ఈ అంతరాయం ఏర్పడుతుందన్నారు.
AKP: చెన్నైలో నేటి నుంచి 23 వరకు జరిగే ‘అండర్-15 సౌత్ జోన్ ఖేలో ఇండియా రగ్బీ’ జట్టు కోచ్గా అచ్యుతాపురానికి చెందిన వెంకట్ ఎంపికయ్యారు. ఈ విషయాన్ని రగ్బీ అసోసియేషన్ ఏపీ కార్యదర్శి రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి నాగ వెంకటరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం వెంకట్ అనకాపల్లి ప్రైవేట్ స్కూల్లో వ్యాయామం ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నట్లు తెలిపారు.
PPM: సాలూరు 11KV ఫీడర్ల వద్ద చెట్లుకొమ్మలు తొలగించే కార్యక్రమం నిర్వహిస్తున్నందున శుక్రవారం ఉదయం 8 నుంచి 2 వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని EE గోపాల్ నాయుడు గురువారం తెలిపారు. ఈ మేరకు శ్రీనివాస కాలనీ నుంచి జైపూర్ రోడ్డు వరకు, బంగారమ్మపేట, మరిపల్లి నుంచి రేగాపువలస వరకు విద్యుత్ సరఫరా ఉండదని వినియోగదారులు సహకరించాలని కోరారు.
E.G: కొవ్వూరు మండలం వేములూరులో కొత్త విద్యుత్ లైన్ నిర్మాణ పనుల కారణంగా శుక్ర, శనివారాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని ఈఈ నారాయణ అప్పారావు తెలిపారు. ఈ 2రోజులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అగ్రికల్చర్ సర్వీసులకు సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
KRNL: కోడుమూరు(M) కృష్ణాపురంలో మూడో విడత కుట్టుమిషన్లు, తైవాన్ స్ప్రే పంపుల పంపిణీ కార్యక్రమం జరిగింది. KDCC బ్యాంక్ ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, MLA దస్తగిరి సహకారంతో మహిళలకు సబ్సిడీపై కుట్టు మిషన్లు, రైతులకు తైవాన్ స్ప్రేయర్లు అందజేశారు. మహిళలు స్వయం ఉపాధి సాధించాలని, రైతులు ఆధునిక పరికరాలతో దిగుబడులు పెంచుకోవాలని ఈ సందర్భంగ నాయకులు ఆకాంక్షించారు.
NDL: కొలిమిగుండ్ల మండలం నందిపాడు గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ రెడ్డి, ఓబులేసు అనే ఇద్దరికీ చీటింగ్ కేసులో ఒక సంవత్సరం జైలు శిక్ష రూ. 5000 జరిమానాను బనగానపల్లె కోర్టు విధించినట్లు ఇవాళ కొలిమిగుండ్ల సీఐ రమేష్ బాబు తెలిపారు. అనంతరం ఇద్దరు ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు.
NLR: నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి పీఏ అంటూ బెదిరింపులకు దిగిన నకిలీ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు గురువారం నెల్లూరు 4వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
W.G: ఏలూరుపాడులో గురువారం జరిగిన ప్రమాదంలో తూము జాన్ సతీశ్ (27) అనే యువకుడు మృతి చెందాడు. కలిదిండి మండలం సింగరాయిపాలెంకు చెందిన సతీశ్, చెరువు గట్టు వేస్తుండగా బ్లేడు ట్రాక్టర్ అదుపుతప్పి తిరగబడింది. ఇంజిన్ కింద పడటంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఏడాది క్రితమే వివాహమైన సతీశ్ మృతితో కుటుంబంలో విషాదం నిండింది. పోలీసులు కేసు నమోదు చేశారు.
SKLM: మెళియాపుట్టి విద్యుత్ ఉప కేంద్రం పరిధిలో నిర్వహణ పనుల నిమిత్తం ఇవాళ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని టెక్కలి డివిజనల్ విద్యుత్ అధికారి నర్సింహ కుమార్ తెలిపారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తిడ్డిమి, చాపర గ్రామీణ, పారిశ్రామిక పీడర్ల పరిధిలో సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు గమనించి, విద్యుత్ శాఖ వారికి సహకరించాలని కోరారు.
కోనసీమ: దరియాలతిప్ప పరిధిలోని పంట పొలాలకు తక్షణమే సాగునీరు విడుదల చేయాలని కోరుతూ రైతులు గురువారం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక న్ను కలిశారు. సాగు నీరు అందక పోవడంతో ఎదిగిన పైరు ఎండిపోయే దశకు చేరుకుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే, వెంటనే అధికారులతో మాట్లాడారు. సాగునీరు అందించాలని అధికారులకు సూచించారు.
PPM: జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి గురువారం కలక్టరేట్లో సివిల్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యోగుల, ఉపాద్యాయుల సమస్యల పరష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఉద్యోగులకు ఏ రకమైన సమస్యలు ఉన్నా సంకోచించకుండా నేరుగా తనను సంప్రదించవచ్చని భరోసా ఇచ్చారు.
NTR: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రూ.1 కోటి 64 లక్షల వ్యయంతో నిర్మించనున్న కర్మల భవన నిర్మాణానికి ఎమ్మెల్యే బోండా ఉమా శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్థానిక ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించడమే లక్ష్యంగా ఈ భవన నిర్మాణాన్ని చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
KDP: ప్రొద్దుటూరు నేర సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ విశ్వనాథ్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత వాతావరణానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మహిళా భద్రత, గంజా నిర్మూలన, రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్ల కదలికలపై నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.