కడప: చెన్నూరు మండలం దౌలతాపురంలో ఆదివారం ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు యామిని, సెక్రటరీ ఎస్. బాబా ఫక్రుద్దీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. న్యాయ విభాగ ఆధ్వర్యంలో నీటి దినోత్సవం ప్రాముఖ్యత, న్యాయపరమైన అంశాలపై అవగాహన కల్పించారు.